కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన దగ్గుబాటి దంపతులు మళ్లీ సొంత గూటికే చేర నున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న దగ్గుబాటి దంపతులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న వార్తలు రాజకీయంగా వేడెక్కిస్తున్నాయి.
అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది చరిత్ర చెబుతున్న సత్యం కాబట్టి ఈ పరిణామం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.