Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

ఠాగూర్
శుక్రవారం, 29 నవంబరు 2024 (16:43 IST)
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైవుంది. ఇది తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ అమరావతి విభాగం వెల్లడించింది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం చెన్నైకు ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. ఇది తుఫానుగా మారిన తర్వాత వాయువ్య దిశగా పయనిస్తూ శనివారం మధ్యాహ్నానికి కారైక్కాల్ - మహాబలిపురం ప్రాంతాల మధ్య తీరం దాటొచ్చని అంచనా వేస్తు్న్నారు. ఈ తుఫానుకు ఫెంగల్ అని నామకరణం చేసిన విషయంతెల్సిందే.
 
దీని ప్రభావం కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాలో గరిష్టంగా గంటకు 60 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అందువల్ల జాలర్లు చేపలవేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళిన వారు తక్షణం తీరానికి తిరిగి రావాలని కోరింది. 
 
ఇదిలావుంటే, తుఫాను నేపథ్యంలో ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. రాష్ట్రంలో మిగిలిన పోర్టుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: ఏ మాయ చేసావేలో మహేష్ బాబు నటించివుంటే ఎలా వుంటుంది?

Tamannaah: విజయ్‌తో బ్రేకప్ తర్వాత హ్యాపీగా వున్న తమన్నా.. ఫోటోలు వైరల్

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

HariHara : పులుల్ని వేటాడే బెబ్బులిగా హరిహరవీరమల్లు ట్రైలర్ ఆకట్టుకుంది

Uday Kiran: దిల్ రాజు సోదరుడే క్షమాపణ చెప్పారు.. మెగా ఫ్యామిలీకి ఉదయ్ కిరణ్ ఓ లెక్కా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments