Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసని తుఫాను.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. రానున్న 3 రోజులు?

Webdunia
మంగళవారం, 10 మే 2022 (17:19 IST)
అసని తుఫాను ప్రభావంతో.. మంగళ, బుధ, గురువారంతో పాటు మూడు రోజులు తూర్పు గోదావరి, విజయవాడ, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళంలోనే గాక ఒడీశా లోని కోస్తా జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
అసని తుఫాను ప్రభావంతో గాలులు సుమారు గంటకు 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందంటున్నారు అధికారులు. సముద్ర తీరంలో ప్రస్తుతం కెరటాలు భారీగా ఎగిసి పడుతున్నాయి. కెరటాల ప్రభావానికి ఉప్పాడ తీర ప్రాంతం తీవ్రంగా కోతకు గురవుతోంది.
 
మరోవైపు ఈనెల 12వ తేదీ వరకు మత్స్యకారుల సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. విశాఖ,  విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments