Webdunia - Bharat's app for daily news and videos

Install App

కష్టంగా మారుతున్న ఓటుకు ప్రయాణం.. రద్దీ రద్దీ.. 

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (13:24 IST)
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తేదీ ఖరారు కావడంతో దేశం నలుమూలలా ఉన్న ఆంధ్రులు ఏప్రిల్ 11న తమ స్వస్థలాలకు వెళ్లి ఓటు వేయాలనుకుంటున్నారు. ఎన్నికల తేదీ వెలువడిన రెండు రోజులకే ఏప్రిల్ 10వ తేదీ ప్రయాణానికి లక్షల మంది ప్రజలు బస్సు, రైళ్లలో సీటు బుక్ చేసుకున్నారు. 
 
వివిధ ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు నిండిపోయాయి. దాదాపు అన్ని రైళ్లలోనూ ఏప్రిల్ 10వ తేదీ నాటికి ఒక్కటంటే ఒక్క సీటు కూడా లేకపోవడం గమనార్హం. సాధారణంగా రిజర్వేషన్ దొరకకుంటే వెయిటింగ్ లిస్ట్‌లో అయినా బుక్ చేసుకోవచ్చు, కానీ దాదాపు అన్ని రైళ్లలో స్లీపర్, ఏసీ టికెట్లు రిగ్రెట్ కావడంతో కనీసం వెయిటింగ్ లిస్ట్‌లో కూడా బుక్ కావడం లేదు.
 
ఎక్కువ సంఖ్యలో రైళ్లు నడుపుతున్నామని రైల్వే శాఖ చెబుతున్నప్పటికీ కూడా అవన్నీ వేసవి కాలంలో నడిపే ప్రత్యేక రైళ్లు, అవి కూడా ఎన్నికల తేదీకి ముందు కాకుండా వేరే రోజుల్లో ఉన్నాయి. దీనితో ప్రజలు బస్సుల్లో రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్ సర్వీసుల వాళ్లు ఇదే అదనుగా ఛార్జీలను విపరీతంగా పెంచేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments