Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ నిర్మాణాల్లో అన్యమత ప్రచారం?.. శిలువకాదు.. అది ప్లస్‌ గుర్తే.. టీటిడి సిఈ

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (07:02 IST)
తిరుమలలో మరోమారు అన్యమత ప్రచార దుమారం చెలరేగింది. ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాల కారణంగా ఇతర మతాలకు సంబంధించిన పోలీకలు కలిగిన ఏ చిన్న ఆకృతి కనిపించినా శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనం వేధిక వద్ద మహామణి మండపం నిర్మాణ పనులలో భాగంగానే సిమెంట్‌ దిమ్మె పై క్రాస్ గుర్తును కలిగిన ఆకారాలు వెలిశాయి. 
 
దీంతో భక్తులు ఆందోళనకు దిగే అవకాశం ఏర్పడింది. కొందరు హిందూ మత సంస్థలకు సంబంధించిన వ్యక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో టీటీడీ మరోమారు ఉలుక్కు పడింది. వెంటనే రంగంలోకి దిగి వివరణ ఇచ్చింది. ఇది శిలువ గుర్తు ఏ మాత్రం కాదని టిటిడి చీఫ్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఆయన తిరుమలలోని తన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా భవనం లేదా నిర్మాణం చేపట్టే ముందు సివిల్‌ ఇంజనీరింగ్‌లో సెంట్రల్‌ లైన్‌ సిస్టం ప్రకారం ఒక కేంద్రీకృత స్థానం నుంచి నాలుగు మూలాలు అనుసంధానం అయ్యేలా ప్లస్‌ గుర్తును వేసుకుంటారని తెలియ చేశారు. ఇందులో భాగంగానే టిటిడి ఇంజనీరింగ్‌ సిబ్బంది నాదనీరాజనం వేదిక ముందు ప్లస్‌ గుర్తు వేశారని వివరించారు.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments