Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య.. రాజధాని రైతులకు కౌలు చెల్లింపు..

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (14:22 IST)
న్యాయ పోరాటం తర్వాత అమరావతి రాజధాని రైతులకు కౌలు చెల్లింపులు జరిగాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వార్షిక కౌలును సీఆర్డీఏ ఎట్టకేలకు మంజూరు చేసింది. 
 
భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులు, వ్యక్తులకు వారి ఖాతాల్లో రెండు విడతల్లో ఆ నిధులను జమ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం కౌలు చెల్లింపు కోసం రూ.208 కోట్లకు బడ్జెట్‌ను విడుదల చేసింది. 
 
దీని నుంచి సుమారు 23వేల మందికి పైగా రైతులకు రూ.184 కోట్లను వారి వారి ఖాతాల్లో జమచేశారు. ఈ నెల 27న రూ.112 కోట్లు, మంగళవారం  మిగిలిన రూ.72 కోట్లను వేశారు. గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం రూ.195 కోట్లకు బడ్జెట్‌ విడుదల చేయగా... రూ.188 కోట్లను కౌలు కింద చెల్లించారు. 
 
ప్రతి ఏటా మే నెల మొదటి వారంలో ఇవ్వాల్సిన కౌలును మూడేళ్ల నుంచి ఆలస్యం చేస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము భూములిచ్చి సీఆర్‌డీఏ కార్యాలయం, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు.

ఈ ఏడాది కూడా హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యం విచారణకు రానుండడంతోనే కౌలు మొత్తాన్ని అధికారులు చెల్లించారని రైతులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments