Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య.. రాజధాని రైతులకు కౌలు చెల్లింపు..

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (14:22 IST)
న్యాయ పోరాటం తర్వాత అమరావతి రాజధాని రైతులకు కౌలు చెల్లింపులు జరిగాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వార్షిక కౌలును సీఆర్డీఏ ఎట్టకేలకు మంజూరు చేసింది. 
 
భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులు, వ్యక్తులకు వారి ఖాతాల్లో రెండు విడతల్లో ఆ నిధులను జమ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం కౌలు చెల్లింపు కోసం రూ.208 కోట్లకు బడ్జెట్‌ను విడుదల చేసింది. 
 
దీని నుంచి సుమారు 23వేల మందికి పైగా రైతులకు రూ.184 కోట్లను వారి వారి ఖాతాల్లో జమచేశారు. ఈ నెల 27న రూ.112 కోట్లు, మంగళవారం  మిగిలిన రూ.72 కోట్లను వేశారు. గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం రూ.195 కోట్లకు బడ్జెట్‌ విడుదల చేయగా... రూ.188 కోట్లను కౌలు కింద చెల్లించారు. 
 
ప్రతి ఏటా మే నెల మొదటి వారంలో ఇవ్వాల్సిన కౌలును మూడేళ్ల నుంచి ఆలస్యం చేస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము భూములిచ్చి సీఆర్‌డీఏ కార్యాలయం, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు.

ఈ ఏడాది కూడా హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యం విచారణకు రానుండడంతోనే కౌలు మొత్తాన్ని అధికారులు చెల్లించారని రైతులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments