Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరెక్కడ పతివ్రతలో చెప్పండి... సీఆర్‌సీ మాటలపై మండలిలో రభస

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (08:43 IST)
ఏపీ శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుడు రామచంద్రయ్య వ్యాఖ్యలు దుమారం రేపాయి. మీరేం ప్రతివ్రతలా అంటూ తెలుగుదేశం సభ్యులపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. టీడీపీ సభ్యురాలు ప్రతిభాభారతి దీనిపై రామచంద్రయ్య క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. వివరాలిలా ఉన్నాయి. 
 
కరువుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య టీడీపీ సభ్యులను ఉద్దేశించి ‘మీరంతా పతివ్రతలా’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ మహిళా సభ్యులు తీవ్రంగా ఖండించారు. ‘‘నిండు సభలో అనుచిత వ్యాఖ్యలతో ఆడవాళ్లను అవమానిస్తారా? తక్షణమే క్షమాపణ చెప్పాలి’’ అని ఎమ్మెల్సీ ప్రతిభా భారతి డిమాండ్‌ చేశారు. 
 
క్షమాపణ చెప్పేవరకు సభ జరగనివ్వబోమని ఆమె స్పష్టం చేశారు. అయితే.. రామచంద్రయ్య తన పార్టీ సభ్యులను తీసుకుని మౌనంగా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో సభలో గందరగోళం సద్దుమణిగి కరువుపై చర్చ కొనసాగింది.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments