Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పనికిమాలిన పాదయాత్ర అవసరమా : రామకృష్ణ

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2017 (14:38 IST)
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడం మానేసి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ చేపట్టిన పాదయాత్ర వల్ల ఎవరికీ ఉపయోగం లేదని విమర్శించారు. అందువల్ల జగన్ తన పార్టీలోని ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విధంగా ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఈనెల 16వ తేదీన ప్రత్యేక హోదా కోసం చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు ఎటువంటి నిధులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ నేతలు సిగ్గులేకుండా చెప్పడం ఏంటని ఆయన నిలదీశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments