లోకేష్ వెన్నుపోటు పొడుస్తాడేమోనని బాబుకు భయం... పవన్ మెరుపులా మాయం...

రాజకీయ నాయకుల్లో అతికొద్దిమంది తాము అనుకున్నది అనుకున్నట్లుగా ముఖం మీదే చెప్పేస్తుంటారు. ఈ విషయంలో ఎవరు ఎలా నొచ్చుకున్నా వాళ్లు పట్టించుకోరు. అలాంటివారిలో సీపీఐ పార్టీకి చెందిన నారాయణ ఒకరు. కేంద్రం బడ్జెట్ కేటాయింపులపై నారాయణ స్పందించారు. ఈ సందర్భంగా

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (15:56 IST)
రాజకీయ నాయకుల్లో అతికొద్దిమంది తాము అనుకున్నది అనుకున్నట్లుగా ముఖం మీదే చెప్పేస్తుంటారు. ఈ విషయంలో ఎవరు ఎలా నొచ్చుకున్నా వాళ్లు పట్టించుకోరు. అలాంటివారిలో సీపీఐ పార్టీకి చెందిన నారాయణ ఒకరు. కేంద్రం బడ్జెట్ కేటాయింపులపై నారాయణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమరావతి కేపిటల్ గెయిన్స్ పేరుతో ఏపీని కేంద్రం దగా చేసిందని దుయ్యబట్టారు. బడ్జెట్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు చూసి జడుసుకున్నారని అన్నారు. భవిష్యత్తులో తన కొడుకు కూడా ములాయం సింగ్ యాదవ్‌కు అఖిలేష్ వెన్నుపోటు పొడిచినట్లు వ్యవహరిస్తాడేమోనన్న భయంతో లోకేష్ బాబుకు మంత్రి పదవి కట్టబెట్టబోతున్నారని విమర్శించారు.
 
ఇక జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ నిలకడలేని రాజకీయాలు చేస్తున్నారనీ, రాజకీయాల్లో ఆయన ఓ మెరుపులా మెరిసి మాయమవుతున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి మెరుపులు ఎక్కువసేపు వుండవనీ, సమయం వచ్చినప్పుడు మెరిసి మాయమవుతుంటాయని అన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ మెరుపులా కాకుండా నిలకడగా రాజకీయాలు చేయాలనీ, లేదంటే భవిష్యత్తు వుండదని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments