Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు - 9 నెలల శిశువుకు పాజిటివ్

ఠాగూర్
శుక్రవారం, 23 మే 2025 (18:54 IST)
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తొమ్మిది నెలల శిశువుకు ఈ వైరస్ సోకింది. అలాగే, కేరళ, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇది ప్రతి ఒక్కరినీ ఆందోళన కలిగంచే అంశంగా వుంది. దీంతో ఏపీ వైద్య శాఖ కూడా అప్రమత్తమైంది. కర్నాటక రాజధాని బెంగుళూరులో 9 నెలల పసికందుకు కరోనా సోకినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. హొస్కోటే ప్రాంతానికి చెందిన ఈ చిన్నారి అనారోగ్యంబారినపడటంతో తొలుత ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం వాణి విలాస్ ఆస్పత్రికి తరలించగా, అక్కడు వైద్యులు పరీక్ష చేసి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. 
 
ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు... క్రమంగా పెరుగుతున్న కేసులు 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. బుధవారం నాడు వైజాగ్‌లో ఓ కేసు వెలుగుచూడగా, తాజాగా కడప జిల్లాలో ఓ వృద్ధురాలికి ఈ వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. ఈ పరిణామంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై ప్రజలకు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. 
 
నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 యేళ్ల వృద్ధురాలు తీవ్ర జ్వరంతో బాధపడుతూ కడపలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లో చేరారు. అక్కడ వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆమెను ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వారు వెల్లడించారు. 
 
వామ్మో... దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. ఏపీలోకి ఎంట్రీ ఇచ్చింది... 
 
ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. చైనా, సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. భారత్‌లో కూడా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఓ కరోనా కేసు నమోదైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 257 కరోనా కేసులు నమోదైవున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 
 
విశాఖపట్టణం నగరంలోని మద్దిలపాలెంకు చెందిన 23 యేళ్ల యువతి కార్పొరేట్ ఆస్పత్రిలో 4 రోజుల క్రితం జ్వరంతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ వైరస్ సోకినట్టు పరీక్షల్లో తేలింది. ఇదే నమూనాను విశాఖ కేజీహెచ్‌లోని వైరాలాజీ ప్రయోగశాలలో పరీక్షించి కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. 
 
అయితే, ఆమె ఆరోగ్యం నిలకడా ఉన్నందున గురువారం సాయంత్రం ఆస్పత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్ చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. అలాగే, ముందు జాగ్రత్తగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలకు జిల్లా అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments