Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో కొనసాగుతున్న వైరస్ వ్యాప్తి .. మరో 33 కొత్త కేసులు

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (17:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఫలితంగా శుక్రవారం కూడా మరో 33 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,638 నమూనాలు పరీక్షించగా, అందులో 33 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు తేలింది. ఈ కేసులతో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,874కి చేరింది. 
 
కాగా, రాష్ట్రంలో కొత్తగా వచ్చిన వాటిలో 6 కేసులకు కోయంబేడు లింకు ఉన్నట్టు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 2 కేసులు వెలుగుచూశాయి. శుక్రవారం 79 మంది డిశ్చార్జి కావడంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,037కి పెరిగింది. 
 
మరోవైపు, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 777 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, గడచిన 24 గంటల్లో కర్నూలులో ఒక కరోనా మరణం సంభవించింది. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 60 మంది కరోనాతో మృత్యువాత పడినట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వైద్య బులిటెన్‌లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments