Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలలో విధిగా కోవిడ్ నిభందనలు: అదనపు కమిషనర్ డా.జె.అరుణ‌

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (18:43 IST)
పాఠశాలల్లో అత్యవసర సౌకర్యాలు కల్పించ‌డానికి చేపట్టవలసిన చర్యలపై గురువారం విజ‌య‌వాడ  నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డా.జె.అరుణ‌ తనిఖి చేసారు. నగర పరిధిలోని మూడు పాఠశాల్లో శిదిలామైన భవనాలైన దుర్గాపురంలోని వెంకటేశ్వరరావు ఉన్నత, ప్రాధమిక  పాఠశాలలను సందర్శించి పెచ్చులూడిన గదులను, దెబ్బతిన్న కిటికీలు, గోడలను పరిశీలించారు. వెంటనే వార్డ్ ఎనిమిటిస్ సెక్రటరి అబ్దుల్ రహీమ్ కు ఎస్టిమేషన్ వేసి పంపవలసినందిగా ఆదేశించారు. అనంత‌రం అరుణ హైస్కూల్, ప్రైమరీస్కూల్ తరగతుల విద్యార్ధులు, టీచర్లతో ముచ్చటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
 
సత్యనారాయణపురంలోని ప్రశాంతి  ప్రాధమిక  పాఠశాల, ఎకెటిపిఎం హైస్కూల్ సందర్శించి అక్కడ  ఎనిమిటిస్ సెక్రటరి నాగరాజు వ‌ద్ద ఎస్టిమేషన్ వివరాలు సేకరించారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు పాఠశాలలో 1850 మంది విద్యార్ధులకు అదనపు తరగతుల అవసరమని ప్రస్తావించగా, వెంటనే ప్రపోజల్స్ పంపవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
 
ప్రతి పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు అందరూ కోవిడ్ నిభందనలు పాటిస్తూ,  పాఠశాల కార్యక్ర‌మాలు నిర్వహించాలని, మధ్యాహ్నం భోజన సమయంలో పరిశుభ్రత,  సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యకమoలో పాఠశాలల సూపర్వైజర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments