Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య, వేద పాఠశాల విద్యార్థులు సేఫ్

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (21:59 IST)
సెకండ్ వేవ్ కరోనా మళ్ళీ మొదలైందన్న విషయం తెలిసిందే. ఎపిలో వేగంగా వ్యాపిస్తోంది. కరోనా సోకిన వారు ఇళ్ళలోనో.. లేకుంటే ప్రభుత్వ ఆసుప్రతులకు వెళుతున్నారు. ప్రత్యేకంగా కరోనా కోసం గతంలోలా వార్డులు కూడా లేవు. అయితే తిరుమలలో వేదపాఠశాల విద్యార్థులు కరోనా బారిన పడటం పెద్ద చర్చకు దారితీసింది.
 
అది కూడా వేదాలను నేర్చుకునే వేదపాఠశాల విద్యార్థులు ఒకరిద్దరు కాదు.. ఏకంగా 56 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టిటిడిలోను ఇది పెద్ద చర్చకే దారితీసింది. చివరకు వేద పాఠశాలలోని అందరు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పరీక్షలు చేశారు.
 
56 మంది కరోనా నిర్థారణ కావడంతో వారిని మాత్రమే తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి వారం రోజుల క్రితం తీసుకొచ్చి చేర్పించారు. అయితే వారంరోజుల పాటు మెరుగైన వైద్యాన్ని వారికి అందించారు. చివరకు కరోనా నుంచి కోలుకున్నారు వేదపాఠశాల విద్యార్థులు.
 
సంపూర్ణ ఆరోగ్యంతో వారు బయటకు వచ్చారు. వేదపాఠశాల విద్యార్థులతో స్వయంగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడారు. మరో 10 రోజుల పాటు ఇంటి దగ్గరే ఉండాలని వైద్యులు సూచించారు. వేదపాఠశాల విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడం వల్లనే వారు సురక్షితంగా బయటపడగలిగారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments