Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య, వేద పాఠశాల విద్యార్థులు సేఫ్

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (21:59 IST)
సెకండ్ వేవ్ కరోనా మళ్ళీ మొదలైందన్న విషయం తెలిసిందే. ఎపిలో వేగంగా వ్యాపిస్తోంది. కరోనా సోకిన వారు ఇళ్ళలోనో.. లేకుంటే ప్రభుత్వ ఆసుప్రతులకు వెళుతున్నారు. ప్రత్యేకంగా కరోనా కోసం గతంలోలా వార్డులు కూడా లేవు. అయితే తిరుమలలో వేదపాఠశాల విద్యార్థులు కరోనా బారిన పడటం పెద్ద చర్చకు దారితీసింది.
 
అది కూడా వేదాలను నేర్చుకునే వేదపాఠశాల విద్యార్థులు ఒకరిద్దరు కాదు.. ఏకంగా 56 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టిటిడిలోను ఇది పెద్ద చర్చకే దారితీసింది. చివరకు వేద పాఠశాలలోని అందరు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పరీక్షలు చేశారు.
 
56 మంది కరోనా నిర్థారణ కావడంతో వారిని మాత్రమే తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి వారం రోజుల క్రితం తీసుకొచ్చి చేర్పించారు. అయితే వారంరోజుల పాటు మెరుగైన వైద్యాన్ని వారికి అందించారు. చివరకు కరోనా నుంచి కోలుకున్నారు వేదపాఠశాల విద్యార్థులు.
 
సంపూర్ణ ఆరోగ్యంతో వారు బయటకు వచ్చారు. వేదపాఠశాల విద్యార్థులతో స్వయంగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడారు. మరో 10 రోజుల పాటు ఇంటి దగ్గరే ఉండాలని వైద్యులు సూచించారు. వేదపాఠశాల విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడం వల్లనే వారు సురక్షితంగా బయటపడగలిగారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చెప్పారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments