Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సచివాలయాన్ని వీడని కరోనా.... 27 మందికి పాజిటివ్

Webdunia
గురువారం, 2 జులై 2020 (15:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయాన్ని కరోనా వైరస్ ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య ఇప్పటివరకు 27కు చేరింది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. అసెంబ్లీలో కరోనా వైరస్ కేసులు వెలుగు చూసినప్పటి నుంచి ప్రతి రోజూ శానిటైజేషన్ పనులు చేస్తూనే ఉన్నారు. కానీ, ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా మరో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్ బారినపడిన సచివాలయ ఉద్యోగుల సంఖ్య 27కు చేరింది. 
 
ఇదిలావుండగా, ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి విశృంఖలంగా కొనసాగుతోంది. నిత్యం భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ప్రభుత్వ యంత్రాంగానికి సవాలు విసురుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 29 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో గుర్తించగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో మరో 4 కేసులు వెల్లడయ్యాయి. దాంతో ఇప్పటివరకు ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,097కి చేరింది. 
 
తాజాగా 281 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తమ్మీద రాష్ట్రంలో 7,313 మంది డిశ్చార్జి కాగా, 6,673 మంది ఆసుపత్రులలో, 1,913 మంది కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. ఇక, గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 198కి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments