Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా రాకెట్ : మరో 31 పాజిటివ్ కేసులు నమోదు

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (14:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల పెరుగదల స్కై రాకెట్‌లా కనిపిస్తోంది. శనివారం కూడా మరో 31 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 603కు చేరింది. ఇందులో 15 మంది చనిపోగా, మరో 42 మంది చికిత్స నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఇకపోతే, రాష్ట్రంలోని జిల్లాల్లో కర్నూలు జిల్లా కరోనా కేసుల నమోదులో అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా 129 కేసులు నమోదు కాగా, వారిలో 126 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఇద్దరు మృతి చెందగా, ఒకరు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఆ తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా 126 కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు చెప్పింది. గుంటూరులో 122 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  
 
ఈ రెండు జిల్లాల తర్వాత అత్యధికంగా నెల్లూరులో 67 కేసులు నమోదు కాగా, 64 మందికి చికిత్స అందుతోంది. ఒకరు డిశ్చార్జ్‌ కాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లాలో 44 మందికి కరోనా నిర్ధారణ అయింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
 
గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలను పరిశీలిస్తే, ఈస్ట్ గోదావరిలో 2, కృష్ణాలో 18, కర్నూలులో 5, నెల్లూరులో 3, ప్రకాశంలో 2, వెస్ట్ గోదావరిలో ఒకటి చొప్పున మొత్తం 31 కేసులు నమోదయ్యాయి. 
 
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే, చిత్తూరులో 29, అనంతపురంలో 22, గుంటూరులో 122, కడపలో 24, కృష్ణలో 61, కర్నూలులో 129, నెల్లూరులో 67, ప్రకాశంలో 44, విశాఖపట్టణంలో 20, వెస్ట్ గోదావరిలో 35 చొప్పున నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments