Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చటి సీమలో కరోనా కల్లోలం : తూగో జిల్లాల్లో ఒకే రోజు 28 కేసులు

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (18:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చటి సీమగా పేరుగాంచిన కోనసీమ జిల్లాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో కలిపి ఒక్క రోజులోనే ఏకంగా 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
నిజానికి లాక్డౌన్ సమయంలో ఈ జిల్లాల్లో నమోదైన కేసులు సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ, లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఈ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో లాక్డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. 
 
ప్రధానంగా ముంబైతోపాటు.. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల కారణంగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో కోనసీమ వాసులు వణికిపోతున్నారు. 
 
తాజాగా నమోదైన 28 కరోనా కేసుల్లో రాజోలు క్వారంటైన్‌లోని 12 మందికి, రావులపాలెంలో ఐదుగురికి, ముమ్మిడివరంలో ముగ్గురికి, అమలాపురంలో ఏడుగురికి, పిఠాపురంలో ఒక నర్సుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ కేసుల కారణంగా కోనసీమ ఒక్కసారి ఉలిక్కిపడింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments