Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ శాసన మండలి చైర్మన్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (12:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్నది. అదేవిధంగా మహమ్మారి బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇందులో కొంతమంది కోలుకోగా, ఇంకొందరు హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏపీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ కరోనా బారిన పడ్డారు.
 
ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలో షరీఫ్ త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ నేతలు కోరుకుంటున్నారు. మరోవైపు ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కేసుల విషయంలో తమిళనాడును వెనక్కి నెట్టి దేశంలో రెండో స్థానానికి చేరింది.
 
ఆగస్టు 31 తేదీ సాయంత్రానికి ఆంధ్రాలో 4,34,771 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 1,00,276 యాక్టివ్ కేసులుండగా 3,30,526 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,969కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments