Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్ కేసులు..

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (17:33 IST)
రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా 2 వేలలోపే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1728 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,49,705 కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 9 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 6,837 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 20,857 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 8,22,011 మంది రికవరీ అయ్యారు. 
 
అయితే కరోనాతో చిత్తూరు 3, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. కరోనా భయం నీడలో పాఠశాలలు కొనసాగుతున్నాయి. 
 
జూన్‌లో పునః ప్రారంభం కావాల్సిన పాఠశాలలు.. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ఆలస్యంగా తెరచుకున్నాయి. ప్రభుత్వం ఎట్టకేలకు ఈ నెల 2వ తేదీ నుంచి 9, 10 తరగతులకు బోధన ప్రారంభించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ.. తరగతులు నిర్వహిస్తోంది. కొంతమంది ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో పాజిటివ్‌ లక్షణాలు బయట పడుతుండడంతో అంతటా కలవరం రేగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నరేష్‌లో 10 మందికి ఉండే ఎనర్జీ ఉంది.. రాత్రి అయితే తట్టుకోలేకపోతున్నా... : నటి పవిత్ర లోకేశ్ (Video)

నిర్మాత దిల్ రాజు నివాసాల్లో ఐటీ మెరుపుదాడులు

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

తర్వాతి కథనం
Show comments