Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను ఓడించిన కేరళ వృద్ధ దంపతులు

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (19:53 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వృద్ధులకు సోకితే ఇక ఆశలు వదులుకోవాల్సిందేనన్న ప్రచారం సాగింది. కానీ, ఈ వృద్ధ దంపతులు మాత్రం అది తప్పు అని నిరూపించారు. ఈ వృద్ధ దంపతులు కరోనాను జయించారు. ఫలితంగా వారిద్దరూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
కేరళ రాష్ట్రంలోని పత్తనంతిట్ట ప్రాంతానికి చెందిన ఈ వయోవృద్ధ జంటకు కరోనా సోకడంతో ఆస్పత్రిపాలయ్యారు. వారిని ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, మీడియా జరుగుతున్న ప్రచారంతో బాధితుల కుటుంబీకులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారిపై ఆశలు వదులుకున్నారు.
 
కానీ, ఆ వృద్ధ జంట కరోనాను జయించింది. వీరిలో వృద్ధ భర్త వయసు 93 ఏళ్లు కాగా, భార్య వయసు 88 సంవత్సరాలు. వారి తనయుడు కొన్నిరోజుల క్రితం ఇటలీ నుంచి కుటుంబసమేతంగా స్వస్థలానికి వచ్చాడు. కొడుకు ద్వారా ఆ వృద్ధ దంపతులకు కరోనా సోకింది. దాంతో వారిద్దరినీ కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు అందించిన చికిత్సతో ఇరువురు వైరస్ బారి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. దీంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments