Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను ఓడించిన కేరళ వృద్ధ దంపతులు

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (19:53 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వృద్ధులకు సోకితే ఇక ఆశలు వదులుకోవాల్సిందేనన్న ప్రచారం సాగింది. కానీ, ఈ వృద్ధ దంపతులు మాత్రం అది తప్పు అని నిరూపించారు. ఈ వృద్ధ దంపతులు కరోనాను జయించారు. ఫలితంగా వారిద్దరూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
కేరళ రాష్ట్రంలోని పత్తనంతిట్ట ప్రాంతానికి చెందిన ఈ వయోవృద్ధ జంటకు కరోనా సోకడంతో ఆస్పత్రిపాలయ్యారు. వారిని ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, మీడియా జరుగుతున్న ప్రచారంతో బాధితుల కుటుంబీకులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారిపై ఆశలు వదులుకున్నారు.
 
కానీ, ఆ వృద్ధ జంట కరోనాను జయించింది. వీరిలో వృద్ధ భర్త వయసు 93 ఏళ్లు కాగా, భార్య వయసు 88 సంవత్సరాలు. వారి తనయుడు కొన్నిరోజుల క్రితం ఇటలీ నుంచి కుటుంబసమేతంగా స్వస్థలానికి వచ్చాడు. కొడుకు ద్వారా ఆ వృద్ధ దంపతులకు కరోనా సోకింది. దాంతో వారిద్దరినీ కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు అందించిన చికిత్సతో ఇరువురు వైరస్ బారి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. దీంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments