Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారంలోకి వచ్చి మా పొట్టలు కొడతారా? బొత్సను నిలదీసిన భవన నిర్మాణ కార్మికులు

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (12:31 IST)
ఏపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన శనివారం గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన్ను భవన నిర్మాణ కార్మికులు కడిగిపారేశారు. అధికారంలోకి వచ్చి మా పొట్టలు కొడుతారా అంటూ మండిపడ్డారు. 
 
వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత ఏర్పడింది. దీంతో భవన నిర్మాణ పనులు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో భవన నిర్మాణ కార్మికులు ఆగ్రహోదగ్రులవుతున్నారు.
 
ఇలాంటి తరుణంలో గుంటూరుకు వచ్చిన మంత్రి బొత్సపై వారు తమ ప్రతాపం చూపించారు. మంత్రి బొత్స పర్యటనను అడ్డుకున్నారు. ప్రభుత్వ విధానం వల్ల పనుల్లేక అర్ధాకలితో బతుకుతున్నామని, మీకు ఓట్లేసి గెలిపించినందుకు మాకు చేసిన మేలు ఇదేనా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
దీంతో కార్మికులను సముదాయించి బొత్స ముందుకు సాగారు. అనంతరం నగరంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. డ్రైనేజీ నిర్మాణం నిలిచిపోయిన విషయాన్ని తెలుసుకున్నారు.
 
అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ప్రారంభమైన రోడ్లు, కాలువల నిర్మాణంలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఇలా తయారయ్యాయని, తమ ప్రభుత్వం వీటిని పూర్తి చేస్తుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments