Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఠాణాల‌లో పెరిగిపోతున్న దొంగ‌త‌నాలు; రూ.7 ల‌క్ష‌లు మాయం!

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (10:17 IST)
దొంగ‌ల‌ను ప‌ట్టుకుని పోలీసులు త‌మ ఠాణాల్లో పెడ‌తారు. కానీ, విచిత్రంగా ఠాణాల్లోనే దొంగ‌త‌నాలు ఇటీవ‌ల‌ పెరిగిపోయాయి. మొన్న‌నీ మ‌ధ్య ఒక పోలీస్ స్టేష‌న్లో రిక‌వ‌రీ సొమ్ము గ‌ల్లంతు అయింది. ఇపుడు తాజాగా కృష్ణా జిల్లా నూజివీడు పోలీస్ స్టేష‌న్లో 7 ల‌క్ష‌ల రూపాయ‌లు మాయం అయ్యాయి. 
 
కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఐదు రోజుల క్రితం 7 ల‌క్ష‌ల రూపాయ‌లు మాయం అయ్యాయి. ప్ర‌తి ఆదివారం మద్యం దుకాణాలలో వ‌సూల‌యిన‌ సొమ్మును పోలీస్ స్టేష‌న్లో డిపాజిట్ చేస్తారు. ఆ రోజు బ్యాంకుల‌కు సెల‌వు కావ‌డంతో స్టేష‌న్లో డ‌బ్బు ఉంచి, సోమ‌వారం ఉద‌యం వ‌చ్చి బ్యాంకులో క‌ట్టేస్తారు. ఇలాగే నూజివీడు స్టేష‌న్ లో డిపాజిట్ చేసిన సొమ్ము క‌న‌ప‌డ‌కుండా పోయింది. 
 
అదే సొమ్మును భ‌ద్ర‌ప‌ర‌చాల్సిన రైట‌ర్, కానిస్టేబుల్ జ‌నార్ధ‌న నాయుడు కూడా క‌న‌ప‌డ‌కుండా గైర్హాజ‌ర‌య్యాడు. దీనితో అత‌నిపై అనుమానం వ‌చ్చి, పోలీసులు అంత‌ర్గ‌త విచార‌ణ ప్రారంభించారు. త‌ను ఇంట్లో కూడా క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో, ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు పరారైన కానిస్టేబుల్ జనార్దన్ నాయుడి కోసం వెతుకులాట ప్రారంబించారు. చివ‌రికి ఆయ‌న్ని అదుపులోకి తీసుకున్నారు.
 
సాంకేతిక పరిజ్ఞానంతో జనార్దన్ నాయుడు కన్యాకుమారి లో ఉన్నట్లు గుర్తించి, అక్క‌డికి వెళ్లి, అతన్ని అదుపులోకి తీసుకుని నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ కి తీసుకురానున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments