Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీదేవి : ఆనవాయితీకి తిలోదకాలు!

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (18:38 IST)
తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీదేవి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆది నుంచి వస్తున్న ఆనవాయితీని ఆ పార్టీ నేతలు తిలోదకాలిచ్చారు. 
 
సాధారణంగా ఎవరైనా సిట్టింగ్ ప్రజాప్రతినిధి చనిపోయినప్పుడు, ఆ తర్వాత జరిగే ఉపఎన్నికలో మిగతా పార్టీలు అభ్యర్థిని నిలపకపోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భిన్నంగా వ్యవహరించింది. తమ అభ్యర్థిని బరిలో దింపింది. 
 
కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీదేవి నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత చింతా మోహన్ మాట్లాడుతూ.. అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే సుగుణమ్మ ఎన్నికల్లో పోటీచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వెంకటరమణ కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారని అన్నారు. 
 
కాగా, తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. టీడీపీ వెంకటరమణ సతీమణి సుగుణమ్మను బరిలో నిలుపగా, వైకాపా పోటీకి దూరంగా ఉంది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని బరిలోకి దించింది.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments