Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ప్రాంతవాసుల వినతులు ఇవిగో... రైల్వే మంత్రితో కోమటిరెడ్డి భేటీ

Webdunia
బుధవారం, 24 జులై 2019 (16:49 IST)
కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్‌తో కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి లోక్‌సభ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రాంతవాసుల వినతులను ఓ పత్రంలో అందజేశారు. 
 
ముఖ్యంగా, శాతవాహన, పద్మావతి, గోదావరి, మచిలీపట్నం రైళ్లను భువనగిరి, జనగామ, ఆలేరు రైల్వేస్టేషన్‌లలో ఆపాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజు 30 వేలకు పైగా జనాభా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులకు, రోజువారి కూలీలు అనునిత్యం వళ్లి వస్తుంటారు. వీరంతా సరైన రైలు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
రాష్ట్ర నలుమూలల నుండి ప్రతిరోజు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం 50 వేల మందికి పైచిలుకు భక్తులు వస్తుంటారు. రైల్వే సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. మంత్రి వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో సర్వేలు చేపించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya: సినిమాకు కులం లేదు, సూర్య ఏ కులం? నెటిజన్లపై మంచు మనోజ్ ఫైర్

Karti: సర్దార్ 2 లో హీరో కార్తి పవర్ ఫుల్ లో కన్పించనున్నాడు

Simbu: నాపై రెడ్ కార్డ్ వేశారు, ఏడ్చాను - థగ్ లైఫ్ చేయనని చెప్పేశాను : శింబు

Rashmika: ట్రాన్స్ ఆఫ్ కుబేర టీజర్ రిలీజ్ - రష్మిక హైలైట్, మరి నాగార్జునకు కలిసివస్తుందా ?

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments