Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు భవిష్యత్ కోసం తెరాసలో చేరనున్న సబితా ఇంద్రారెడ్డి!

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (09:09 IST)
తన కుమారుడు రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, చేవెళ్ళ చెల్లెమ్మగా పేరుబడిన మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారు. ఆమెతో పాటు.. ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి కూడా తెరాస తీర్థంపుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌ కూడా పార్టీలో చేరనున్నారు. 
 
ఇదే విషయంపై ఆదివారం ఎంఐఎం అధినేత, హైదరాబాద్ తాజా మాజీ ఎంపీ అసదుద్దీన్‌ నివాసంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో సబిత ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డిలు సమావేశమయ్యారు. వీరంతా కలిసి పార్టీ మార్పుపై చర్చించారు. ఫలితంగా సబితమ్మ పార్టీ మార్పుపై కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. కాగా, ఇప్పటికే ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య అధికార తెరాసలో చేరనున్నట్టు ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఆ మరుసటిరోజే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఝలక్‌ ఇవ్వడం కాంగ్రెస్‌ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. కేటీఆర్‌తో భేటీలో సబితతోపాటు ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ పాల్గొన్నారు. సుమారు గంటన్నరపాటు జరిగిన సమావేశంలో తెరాసలో చేరిన పక్షంలో ఇచ్చే ప్రాధాన్యంపై చర్చ జరిగినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments