Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం... రఘువీరా పర్యటనలో పావురాలకు తారాజువ్వలు కట్టి నిప్పు....

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2015 (17:41 IST)
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏపీ పిసిసీ చీఫ్ రఘువీరా రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనే క్రమంలో కోవూరు వెళ్లారు. తమ నాయకుడు వస్తున్నాడన్న ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరింత అత్యుత్సాహం చూపించారు. వాళ్లకు ఓ ఐడియా వచ్చింది. రఘువీరా రెడ్డికి మామూలుగా కాకుండా కాస్త విభిన్నంగా స్వాగతం పలుకాలని నిర్ణయించుకున్నారో ఏమోగానీ వెంటనే పావురాలను పట్టుకొచ్చారు.
 
ఆ పావురాలకు తమ వద్దనున్న తారాజువ్వలను కట్టి వాటికి నిప్పంటించారు. అంతే... తారాజువ్వలతో పాటు పావురాలు గగనంలోకి దూసుకెళ్లిపోయాయి. వాటి ప్రాణాలు కూడా అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పావురాలను అలా హింసించి చంపారంటూ మండిపడుతున్నారు. వన్యప్రాణుల చట్టం ప్రకారం ఇలాంటి చర్య తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. మరి ఈ దారుణ ఘటన రఘువీరా రెడ్డి దృష్టికి వెళ్లిందో లేదో...?!!

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments