Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకిందనీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి ఆత్మహత్య.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (11:15 IST)
కరోనా వైరస్ చేసే హాని కంటే.. ఈ వైరస్ సోకిందన్న భయం అనేక మంది ప్రాణాలను తీస్తోంది. చదువుకున్న వాళ్లు కూడా ఈ వైరస్‌కు భయపడి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ఒకరు కరోనా వైరస్ సోకడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా గంగిరెడ్డి కొనసాగుతున్నారు. ఈయనకు ఇటీవల కరోనా లక్షణాలు బయపడటంతో పరీక్ష చేయించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది.
 
దీంతో ఆయన్ను ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అయితే, చికిత్సా సమయంలో ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనట్టు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్ళపల్లి అనే ప్రాంతంలో రైలులో నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments