Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతుల మహా పాదయాత్రకు నీరాజనాలు పలకండి: సిపిఐ శ్రేణులకు రామకృష్ణ పిలుపు

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (19:01 IST)
నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 17వ తేదీ వరకు అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల సిపిఐ శ్రేణులు ఘన స్వాగతం పలికి, పాదయాత్రలో పాల్గొనాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు.
 
ఈ మేరకు కె రామకృష్ణ మేరకు నేదోక ప్రకటన విడుదల చేశారు. "అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతుల 45 రోజుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా జరుగుతుంది. రైతుల పాదయాత్ర ఆయా జిల్లాలలోకి ప్రవేశించినప్పుడు సిపిఐ తరపున ఘనస్వాగతం పలికి, పార్టీ శ్రేణులు తప్పక పాదయాత్రలో పాల్గొనాలి.

సిపిఐ నియోజకవర్గ నాయకత్వం, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్రకు స్వాగతం పలికి, నియోజకవర్గం వరకు తప్పక పాల్గొనాలి. తిరుపతిలో జరిగే బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో సిపిఐ నాయకత్వం, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాం.

రైతుల మహాపాదయాత్రతోనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం"  అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments