Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో కరోనా రోగుల ఆందోళన

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (17:07 IST)
సమయానికి భోజనం పెట్టడం లేదంటూ కర్నూలు విశ్వ భారతి కోవిడ్ ఆస్పత్రిలో కరోనా రోగులు మంగళ వారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టారు. 3 గంటలైనా భోజనం ఇవ్వక పోవడంతో ఆగ్రహించిన రోగులు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి నిరసన తెలిపారు.

విధుల్లో ఉన్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సోమవారం రాత్రి 10.30 సమయంలో తమను ఒక భవనం నుండి మరో భవనానికి తరలించారని, దాంతో రోగులందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం కూడా 10.40 వరకూ టిఫిన్ ఇవ్వలేదని, షుగర్, బిపి ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారని తెలిపారు.

ఆస్పత్రి యాజమాన్యం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. రోగులు భోజనం విషయం ఆందోళన చేస్తే వెళ్ళిపోయెందుకు ఆసక్తి ఉన్న వాళ్ళు పేర్లు ఇస్తే డిశ్చార్జి చేస్తామని సిబ్బంది పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో రోగులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. చివరికి భోజనాలు రావడంతో కాస్త శాంతించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments