Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 నుంచి మచిలీపట్నంలో సంపూర్ణ లాక్‌డౌన్‌

Webdunia
గురువారం, 30 జులై 2020 (09:22 IST)
కరోనా కేసులు రోజు రోజుకు ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆగస్టు 3 నుంచి 9 వరకు మచిలీపట్నంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.

ఉదయం 6 నుంచి 9 వరకు నిత్యావసరాలకు అనుమతిస్తున్నామన్నారు. మిగిలిన వ్యాపారాలన్నీ కూడా పూర్తిగా మూసివేయబడతాయన్నారు. బస్సులు, ఆటోలు, మోపెడ్‌లు రోడ్లపై తిరగ రాదని, అందరూ కూడా లాక్‌డౌన్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

వారం రోజులపాటు మచిలీపట్నంలోకి రావడానికి గాని, మచిలీపట్నం నుంచి బయటకు వెళ్లడం గాని చేయకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు సంబంధిత సచివాలయంలో నమోదు చేసుకుని వ్యవసాయ పనులకు వెళ్లాలన్నారు.

మచిలీపట్నంలో బక్రీద్ నాడు ముస్లిం సోదరులు ఇంట్లోనే నమాజ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా 60 సంవత్సరాల వయసున్నవారు, చిన్నపిల్లలు బయటకు రావొద్దన్నారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments