Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ప్యాసిజర్ రైళ్ళ సేవలు

Webdunia
సోమవారం, 19 జులై 2021 (07:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి ప్యాసిజర్ రైళ్ళ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొవిడ్‌-19 తొలిదశ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత నిలిచిపోయిన ప్యాసింజర్‌ రైళ్లను సోమవారం నుంచి తిరిగి పట్టాలెక్కించనున్నారు. 
 
ఇందులోభాగంగా, గుంటూరు జిల్లా మాచర్లలో వేకువజామున 5.30 గంటలకు బయలుదేరే రైలు ఉదయం 8.55 గంటలకు గుంటూరు చేరుకోనుంది. ఆ తర్వాత నరసాపూర్‌ నుంచి బయలుదేరి ఎక్స్‌ప్రెస్‌ రైలు 11.35 గంటలకు గుంటూరు చేరుకొంటుంది. 
 
అదేవిధంగా నడికుడి - కాచిగూడ - నడికుడి ప్యాసింజర్‌ రైలు సేవలు కూడా సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఆదివారం ట్రయల్‌రన్‌ కూడా నిర్వహించారు. కొవిడ్‌ దృష్ట్యా కొన్ని స్టేషన్లలో నిలుపుదల సౌకర్యం ఎత్తివేశారు. 
 
మాచర్ల - గుంటూరు మధ్యన రెంటచింతల, గురజాల, నడికుడి, పిడుగురాళ్ల, బెల్లంకొండ, రెడ్డిగూడెం, సత్తెనపల్లి, పెదకూరపాడు, బండారుపల్లిలో మాత్రమే నిలుపుదల ఉంటుంది. మిగతా స్టేషన్లలో రైళ్లు ఆగవు. కొన్ని రైళ్లకు గుంటూరు - విజయవాడ మార్గంలో పెదకాకాని హాల్ట్‌ని తొలగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments