Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ప్యాసిజర్ రైళ్ళ సేవలు

Webdunia
సోమవారం, 19 జులై 2021 (07:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి ప్యాసిజర్ రైళ్ళ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొవిడ్‌-19 తొలిదశ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత నిలిచిపోయిన ప్యాసింజర్‌ రైళ్లను సోమవారం నుంచి తిరిగి పట్టాలెక్కించనున్నారు. 
 
ఇందులోభాగంగా, గుంటూరు జిల్లా మాచర్లలో వేకువజామున 5.30 గంటలకు బయలుదేరే రైలు ఉదయం 8.55 గంటలకు గుంటూరు చేరుకోనుంది. ఆ తర్వాత నరసాపూర్‌ నుంచి బయలుదేరి ఎక్స్‌ప్రెస్‌ రైలు 11.35 గంటలకు గుంటూరు చేరుకొంటుంది. 
 
అదేవిధంగా నడికుడి - కాచిగూడ - నడికుడి ప్యాసింజర్‌ రైలు సేవలు కూడా సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఆదివారం ట్రయల్‌రన్‌ కూడా నిర్వహించారు. కొవిడ్‌ దృష్ట్యా కొన్ని స్టేషన్లలో నిలుపుదల సౌకర్యం ఎత్తివేశారు. 
 
మాచర్ల - గుంటూరు మధ్యన రెంటచింతల, గురజాల, నడికుడి, పిడుగురాళ్ల, బెల్లంకొండ, రెడ్డిగూడెం, సత్తెనపల్లి, పెదకూరపాడు, బండారుపల్లిలో మాత్రమే నిలుపుదల ఉంటుంది. మిగతా స్టేషన్లలో రైళ్లు ఆగవు. కొన్ని రైళ్లకు గుంటూరు - విజయవాడ మార్గంలో పెదకాకాని హాల్ట్‌ని తొలగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments