ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ప్యాసిజర్ రైళ్ళ సేవలు

Webdunia
సోమవారం, 19 జులై 2021 (07:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి ప్యాసిజర్ రైళ్ళ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొవిడ్‌-19 తొలిదశ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత నిలిచిపోయిన ప్యాసింజర్‌ రైళ్లను సోమవారం నుంచి తిరిగి పట్టాలెక్కించనున్నారు. 
 
ఇందులోభాగంగా, గుంటూరు జిల్లా మాచర్లలో వేకువజామున 5.30 గంటలకు బయలుదేరే రైలు ఉదయం 8.55 గంటలకు గుంటూరు చేరుకోనుంది. ఆ తర్వాత నరసాపూర్‌ నుంచి బయలుదేరి ఎక్స్‌ప్రెస్‌ రైలు 11.35 గంటలకు గుంటూరు చేరుకొంటుంది. 
 
అదేవిధంగా నడికుడి - కాచిగూడ - నడికుడి ప్యాసింజర్‌ రైలు సేవలు కూడా సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఆదివారం ట్రయల్‌రన్‌ కూడా నిర్వహించారు. కొవిడ్‌ దృష్ట్యా కొన్ని స్టేషన్లలో నిలుపుదల సౌకర్యం ఎత్తివేశారు. 
 
మాచర్ల - గుంటూరు మధ్యన రెంటచింతల, గురజాల, నడికుడి, పిడుగురాళ్ల, బెల్లంకొండ, రెడ్డిగూడెం, సత్తెనపల్లి, పెదకూరపాడు, బండారుపల్లిలో మాత్రమే నిలుపుదల ఉంటుంది. మిగతా స్టేషన్లలో రైళ్లు ఆగవు. కొన్ని రైళ్లకు గుంటూరు - విజయవాడ మార్గంలో పెదకాకాని హాల్ట్‌ని తొలగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

Madalsa Sharma: మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ కామెంట్లు.. కెరీర్‌ ప్రారంభంలోనే?

Nandamuri Tejaswini : సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి తేజస్విని

Mickey J. Meyer : నేను రెడీ కోసం మిక్కీ జె మేయర్ మ్యూజిక్

Sreeleela: బాలీవుడ్‌లో శ్రీలీలకు భారీ డిమాండ్.. అరుంధతిగా కనిపించబోతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments