ఇండియన్ ఆర్మీ కాలింగ్ యజమానిపై కఠిన చర్యలు : మంత్రి నారా లోకేశ్

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (11:56 IST)
శ్రీకాకుళం జిల్లాలో మాజీ సైనికోద్యోగి పేరుతో వెంకట రమణ అనే వ్యక్తి స్థానికంగా ఇండియన్ ఆర్మీ కాలింగ్ పేరుతో ఓ ట్రైనింగ్ సెంటర్‌ను నడుపుతున్నాడు. ఇక్కడ శిక్షణ పొందుతున్న యువకులను ఆయన చిత్రహింసలకు గురిచేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై శ్రీకాకుళం పోలీసులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
 
శ్రీకాకుళం జిల్లాలో రిటైర్డ్ ఆర్మీ అధికారినంటూ వెంకట రమణ అనే వ్యక్తి స్థానికంగా ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఆర్మీ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడానికి ఒకొక్కరి నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. శిక్షణకు వచ్చిన ఓ యువకుడిని సంస్థ డైరెక్టర్ రమణ.. కరెంటు వైరుతో విచక్షణారహితంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
 
ఈ వీడియోను కొందరు నెటిజన్లు మంత్రి నారా లోకేశ్‌కు ట్యాగ్ చేసి స్పందించాలని కోరారు. దీనిపై లోకేశ్ వెంటనే స్పందించారు. కారకులపై శ్రీకాకుళం పోలీసులు చర్యలు తీసుకుంటారని లోకేశ్ పేర్కొన్నారు. కాగా, ఈ ఘటన 2023 డిసెంబరులో జరిగినట్లుగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments