Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ ఆర్మీ కాలింగ్ యజమానిపై కఠిన చర్యలు : మంత్రి నారా లోకేశ్

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (11:56 IST)
శ్రీకాకుళం జిల్లాలో మాజీ సైనికోద్యోగి పేరుతో వెంకట రమణ అనే వ్యక్తి స్థానికంగా ఇండియన్ ఆర్మీ కాలింగ్ పేరుతో ఓ ట్రైనింగ్ సెంటర్‌ను నడుపుతున్నాడు. ఇక్కడ శిక్షణ పొందుతున్న యువకులను ఆయన చిత్రహింసలకు గురిచేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై శ్రీకాకుళం పోలీసులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
 
శ్రీకాకుళం జిల్లాలో రిటైర్డ్ ఆర్మీ అధికారినంటూ వెంకట రమణ అనే వ్యక్తి స్థానికంగా ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఆర్మీ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడానికి ఒకొక్కరి నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. శిక్షణకు వచ్చిన ఓ యువకుడిని సంస్థ డైరెక్టర్ రమణ.. కరెంటు వైరుతో విచక్షణారహితంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
 
ఈ వీడియోను కొందరు నెటిజన్లు మంత్రి నారా లోకేశ్‌కు ట్యాగ్ చేసి స్పందించాలని కోరారు. దీనిపై లోకేశ్ వెంటనే స్పందించారు. కారకులపై శ్రీకాకుళం పోలీసులు చర్యలు తీసుకుంటారని లోకేశ్ పేర్కొన్నారు. కాగా, ఈ ఘటన 2023 డిసెంబరులో జరిగినట్లుగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments