Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభవార్త చెప్పిన సీఎం జగన్ - 1998 డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగులు

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (07:39 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. గత 1998లో ఎంపిక అయిన డీఎస్సీ అభ్యర్థులకు త్వరగా పోస్టింగులు ఇవ్వాలంటూ ఆదేశించారు. ఆయన గురువారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, బడిపిల్లలకు అందించే గోరుముద్ద పథకం అమలు, ఆహారం నాణ్యత వంటి అంశాల్లో ఏమాత్రం రాజీపడొద్దని ఆయన అధికారులను కోరారు. ముఖ్యంగా, 1998 డీఎస్పీ అభ్యర్థులకు తక్షణం పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు. 
 
అలాగే పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉండేలా చూసుకోవాలని, తద్వారా నాణ్యమైన బోధన అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. పాఠశాలల్లో పిల్లలందరి వద్ద డిక్షనరీలు ఉన్నాయో లేదో పరిశీలించాలని ఆదేసించారు. డిక్షనరీలు లేని పిల్లలకు తక్షణం వాటిని అందజేయాలని కోరారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి గోరుముద్ద పథకం కింద రాగి మాల్ట్ ఇవ్వాలని, వారానికి మూడు రోజులు పిల్లలకు గ్లాడు రాగి మాల్ట్ ఇవ్వాలని, పిల్లల్లో ఐరన్, కాల్షియం ధాతువుల లోపాన్ని ఇది అరికడుతుందని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments