Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్.. రోడ్ల వెంబడి ఇనుప కంచెలు

Webdunia
గురువారం, 7 జులై 2022 (11:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి గురువారం బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఉదయం 11 గంటలకు పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌కు వస్తారు. ఆ తర్వాత రెండు గంటల పాటు పులివెందుల మున్సిపాలిటీ అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. 
 
పిమ్మట మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. 3 గంటలకు వేంపల్లికి చేరుకుని అక్కడ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. 
 
రాత్రికి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌కు చేరుకుని, తన తండ్రి వైఎస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఆయన విజయవాడకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments