నేడు కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్.. రోడ్ల వెంబడి ఇనుప కంచెలు

Webdunia
గురువారం, 7 జులై 2022 (11:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి గురువారం బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఉదయం 11 గంటలకు పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌కు వస్తారు. ఆ తర్వాత రెండు గంటల పాటు పులివెందుల మున్సిపాలిటీ అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. 
 
పిమ్మట మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. 3 గంటలకు వేంపల్లికి చేరుకుని అక్కడ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. 
 
రాత్రికి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌కు చేరుకుని, తన తండ్రి వైఎస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఆయన విజయవాడకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ పాట... ఆట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments