Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ - అమిత్ షాలతో భేటీ కోసం హస్తినకు సీఎం జగన్

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (12:36 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాత్రి 7.30 గంటలకు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఢిల్లీలోని వైకాపా ఎంపీలు ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, వైకాపా నేత, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపాకు చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో వీరివద్ద సీబీఐ పలుమార్లు విచారణ జరిపింది. అయితే వైఎస్.అవినాశ్ రెడ్డి అరెస్టుకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. దీంతో ఆయన్ను సీబీఐ అరెస్టు చేయలేదు. లేకపోతే గత వారమే అరెస్టు చేసివుండేది. కోడికత్తి కేసులో కూడా బాధితుడైన సీఎం జగన్‌ స్వయంగా హాజరుకావాలని ఎన్.ఐ.ఏ కోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: ముగ్గురు నాయికలుతో సుడిగాలి సుధీర్ హీరోగా హైలెస్సో ప్రారంభం

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్

Sonakshi Sinha: జటాధర లో సోనాక్షి సిన్హా పై ధన పిశాచి సాంగ్ చిత్రీకరణ

మాజీ ప్రియురాలిని మరవలేకపోతున్నా.. ఆర్థిక ఒత్తిడిలో కూడా ఉన్నాను.. డైనింగ్ ఏరియాలో ఉరేసుకుని..?

Chiru: భారతీయుడికి గర్వకారణమైన క్షణం : చిరంజీవి, మోహన్ లాల్, నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

తర్వాతి కథనం
Show comments