Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ - అమిత్ షాలతో భేటీ కోసం హస్తినకు సీఎం జగన్

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (12:36 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాత్రి 7.30 గంటలకు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఢిల్లీలోని వైకాపా ఎంపీలు ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, వైకాపా నేత, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపాకు చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో వీరివద్ద సీబీఐ పలుమార్లు విచారణ జరిపింది. అయితే వైఎస్.అవినాశ్ రెడ్డి అరెస్టుకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. దీంతో ఆయన్ను సీబీఐ అరెస్టు చేయలేదు. లేకపోతే గత వారమే అరెస్టు చేసివుండేది. కోడికత్తి కేసులో కూడా బాధితుడైన సీఎం జగన్‌ స్వయంగా హాజరుకావాలని ఎన్.ఐ.ఏ కోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments