Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో నేను జగన్ రాజకీయ ప్రత్యర్థులం : సీఎం రమేష్

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2015 (12:23 IST)
కడప జిల్లాలో మేమిద్దరం రాజకీయ ప్రత్యర్థులం... నాకు జగన్‌ మోహన్ రెడ్డితో మాట్లాడాల్సిన అవసరమేముందని టీడీపీ యువనేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. విద్యుత్ ఉద్యోగుల వేతనాల విడుదలకు సంబంధించి తాను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడానన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. జగన్‌తో మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. 
 
‘నాకు జగన్‌తో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? కడప జిల్లాలో మేం రాజకీయ ప్రత్యర్థులం. ఆయనకు నేను ఫోన్ చేయలేదు. మాట్లాడలేదు. కొంతకాలం కిందట విద్యుత్ ఉద్యోగులు నన్ను ఢిల్లీలో కలిశారు. నాతో పాటు మిగిలిన ఎంపీలను కలిశారు. వారిని వెంట తీసుకుని కేంద్ర హోం శాఖ మంత్రి వద్దకు వెళ్లి ఆయనకు సమస్య వివరించాం. ఆ తర్వాత వారెవరూ నా దగ్గరకు రాలేదు. నేనెవరికీ ఫోన్ చేయలేదు. మేం అధికారంలో ఉన్నాం. జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయనకు నేనెందుకు ఫోన్ చేస్తాను?’’ అని ఆయన విలేఖరులకు వివరించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments