Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆమ‌ర‌ణ దీక్షా..!

కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు సీఎం రమేష్‌ ఈ నెల 20వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేయాల‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో ర‌మేష్ గ‌త కొన్ని రోజులుగా ఈ విష‌య‌మై చ‌ర్చించారు. ఆఖ‌రికి న

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (14:14 IST)
కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు సీఎం రమేష్‌ ఈ నెల 20వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేయాల‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో ర‌మేష్ గ‌త కొన్ని రోజులుగా ఈ విష‌య‌మై చ‌ర్చించారు. ఆఖ‌రికి నిరాహార దీక్ష చేసేందుకు కడప జిల్లా పరిషత్‌ ఆవరణలో వేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల మేర ఫీజు చెల్లిస్తున్నారు. 
 
ఎక్కడా సామాన్యుల‌కు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఉండేదుంకు జిల్లా పరిషత్‌ ఆవరణను ఆమరణ దీక్షా శిబిరానికి ఎంచుకున్నట్లు సమాచారం. కాగా తొలిరోజు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయ‌కులతో సహా వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ దీక్ష‌కు అన్ని విధాల స‌హ‌క‌రించాల‌ని అధికారుల‌కు, పార్టీ నాయ‌కుల‌కు పార్టీ అధిష్టానం ఆదేశించిన‌ట్టు స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments