రేపు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (15:54 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తనయుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. ఇందుకంసో ఆయన విజయవాడ తాడేపల్లి నుంచి మంగళవారం ఉదయం 10 గంటలకు బయలుదేరి 11 గంటలకు దర్శికి చేరుకుంటారు. అక్కడ రిసెప్షన్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. నూతన దంపతులను ఆశీర్వదించిన తర్వాత ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. సీఎం పర్యటనకు అనుగుణంగా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, ఇటీవల వచ్చిన మాండస్ తుఫాను కారణంగా రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ తుఫాను ప్రభావంతో విస్తారంగా కురిసిన భారీ వర్షాల వల్ల చేతికొచ్చిన పంట నీటమునిగింది. ఈ రైతులను ఒక్కరంటే ఒక్కరు వైకాపా మంత్రి లేదా అధికార యంత్రాంగం లేదా సీఎం పరామర్శించలేదని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. కానీ, తమ పార్టీ నేతల వివాహాది శుభకార్యాలకు మాత్రం సీఎం వచ్చి వెళ్లడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments