Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనల్లుడి నిశ్చితార్థం కోసం హైదరాబాద్ వెళుతున్న సీఎం జగన్

వరుణ్
గురువారం, 18 జనవరి 2024 (09:43 IST)
తన మేనల్లుడు, వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం కోసం వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లి ప్యాలెస్ నుంచి హైదరాబాద్ నగరానికి వెళుతున్నారు. హైదరాబాద్ నగరంలోని గోల్కొండ రిసార్ట్స్‌లో ఈ వేడుక జరుగనుంది. ఈ వేడుక పూర్తయిన తర్వాత ఆయన రాత్రికే అమరావతికి చేరుకుంటారు. 
 
కాగా, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన తనయుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జనవరి 18వ తేదీన హైదరాబాద్ నగరంలో జరుగనుంది. ఈ వేడుకకు హాజరుకావాలంటూ తన అన్న, ఏపీ సీఎం జగన్‌తో పాటు అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులను షర్మిల స్వయంగా ఆహ్వానించారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమం గురువారం రాత్రి జరుగుతుంది. 
 
ఇందులో పాల్గొనేందుకు సీఎం జగన్ గురువారం సాయంత్రం 6.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరుతారు. రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు గంమడిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌కు వెళ్ళి తన మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొంటారు. రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి తాడేపల్లికి చేరుకుంటారు. 19వ తేదీన విజయవాడలో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments