Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో పర్యటించనున్న జగన్ : అపాచీ కర్మాగారానికి శంకుస్థాపన

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (12:27 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా పోలీసు విభాగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి విమానాశ్రయానికి చేరుకున్న తరువాత అక్కడ నుంచి ఒక ఆలయాన్ని ప్రారంభించడానికి హెలికాప్టర్లో ఆలయం సమీపానికి చేరుకుంటారు. 
 
ఆలయం వద్ద హెలిప్యాడ్, ఆలయం పరిసరాలలో భద్రతా ఏర్పాట్లను అనంతపురం రేంజ్ డి.ఐ.జి రవి ప్రకాష్, జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర్ రెడ్డి ఇంటెలిజెన్స్ ఎస్పీ సతీష్ బాబు కలిసి బుధవారమే పర్యవేక్షించారు. 
 
అదేవిధంగా శ్రీకాళహస్తి మండలంలోని ఇనగలూరు వద్ద అపాచీ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. 
 
ఈ సందర్భంగా కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ముఖ్యమంత్రి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించే ప్రాంతాలలో కాన్వాయ్ ట్రైల్ రన్ నిర్వహించి భద్రతను సమీక్షించారు. 
 
ప్రతి ప్రాంతంలో సంబంధిత పోలీసు అధికారులకు సూచనలు ఇస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
 
సీఎం పర్యటనకు పోలీస్ అధికారులు సివిల్ విభాగం నుండి 1,050, ఏ.ఆర్ విభాగం నుండి 730 మంది మొత్తం 1,780 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం