Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏపీ సర్కారు సీరియస్.. రంగంలోని ఇంటెలిజెన్స్

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (13:55 IST)
సొంత పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (వైకాపా) చేసిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగాన్ని రంగంలోకి దించింది. ఇందుకోసం ఆడియో రికార్డుల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అలాగే, శ్రీధర్ రెడ్డితో ఫోనులో మాట్లాడిన రామశివారెడ్డిని కూడా విచారించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
బుధవారం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులతో సమావేశమై కోటంరెడ్డి చేసిన ఆరోపణలపై సుధీర్ఘంగా చర్చించారు. 
 
ఆ తర్వాత ఇంటెలిజెన్స్ విభాగాన్ని రంగంలోకి దించి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా ఇప్పటికే రామశివారెడ్డి కాల్ డేటాను సేకరించినట్టు సమాచరాం. అయితే, సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యవహారం ఎంతదూరం వెళుతుందో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments