Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏపీ సర్కారు సీరియస్.. రంగంలోని ఇంటెలిజెన్స్

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (13:55 IST)
సొంత పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (వైకాపా) చేసిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగాన్ని రంగంలోకి దించింది. ఇందుకోసం ఆడియో రికార్డుల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అలాగే, శ్రీధర్ రెడ్డితో ఫోనులో మాట్లాడిన రామశివారెడ్డిని కూడా విచారించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
బుధవారం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులతో సమావేశమై కోటంరెడ్డి చేసిన ఆరోపణలపై సుధీర్ఘంగా చర్చించారు. 
 
ఆ తర్వాత ఇంటెలిజెన్స్ విభాగాన్ని రంగంలోకి దించి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా ఇప్పటికే రామశివారెడ్డి కాల్ డేటాను సేకరించినట్టు సమాచరాం. అయితే, సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యవహారం ఎంతదూరం వెళుతుందో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments