రాబోయే 30 యేళ్లు వైకాపాదే అధికారం : సీఎం జగన్ జోస్యం

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (16:27 IST)
వచ్చే 30 యేళ్ల పాటు వైకాపాదే అధికారం అని ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. పైగా, 175కు 175 సీట్లు సాధించి క్లీన్ స్వీప్ చేయడం సాధ్యమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
 
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగింస్తూ, రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. అవినీతి రహితంగా పాలిస్తున్నందుకు ప్రజలు మరోమారు తమకే పట్టం కడతారని ఆయన జోస్యం చెప్పారు. 
 
మంచి చేశామని సగర్వంగా తలెత్తుకునేలా మన పరిపాలన సాగుతోందన్నారు. మూడున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన కోరారు. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్లంతా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని, వారి ఆశీర్వాద బలంతో వచ్చే 30 యేళ్లు రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉంటుందని చెప్పారు. 
 
ప్రభుత్వ పనితీరు ఇపుడు అంతటా మారిపోయిందన్నారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌తో పల్లెల వాతావరణమే మారిపోయిందని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు వివరించి వచ్చే ఎన్నికల్లో కూడా మనకే ఓటు వేయాలని ప్రతి ఒక్కరికీ చెప్పాలని, ఇందుకోసం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments