Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌పై రాయితో దాడి.. ఎన్నికల సంఘం ఆరా!!

వరుణ్
ఆదివారం, 14 ఏప్రియల్ 2024 (08:28 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై చిన్నపాటి రాయితో దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన ఎడమ కన్ను పైభాగంలో చిన్నపాటి దెబ్బ తగిలింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనా ఆరాతీశారు. విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పైగా, ఈ దాడి నేపథ్యంలో జగన్ తన బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ దాడి శనివారం రాత్రి జరిగింది. ఆదివారం కావడంతో దాడిని సాకుగా చూపించి బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారన్న వ్యాఖ్యానాలు కూడా విపక్ష నేతల నుంచి వినిపిస్తున్నాయి. అలాగే, తదుపరి యాత్రపై వైకాపా ఆదివారం క్లారిటీ ఇవ్వనుంది. 
 
మరోవైపు, విజయవాడ సీపీతో మాట్లాడిన ముఖేశ్ కుమార్ మీనా... ఏం జరిగిందన్న దానిపై ఆదివారం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నిందితులు త్వరగా గుర్తించాలని సీపీని సూచించారు. మరోవైపు, రాయిదాడిలో చిన్నపాటి గాయం తగిలిన జగన్‌ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నుదుటిపై వాపు ఎక్కువగా ఉండటంతో విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం తన యాత్రకు ఆదివారం విరామం ఇచ్చారు. యాత్ర తదుపరి షెడ్యూల్‌పై వైకాపా ఆదివారి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments