Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో జిల్లాకో విమానాశ్రయం : "వన్ డిస్ట్రిక్ట్ - వన్ ఎయిర్‌పోర్ట్"పై సీఎం జగన్ రివ్యూ

One District-One Airport
Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (09:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాకో విమానాశ్రయం ఏర్పాటుకానుంది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేశారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పోర్టులు, విమానాశ్రయ ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వన్ డిస్ట్రిక్ట్ - వన్ ఎయిర్‌పోర్టు అనే కాన్సెప్టుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. 
 
అన్ని జిల్లాల్లో ఒకే తరహాలో విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని, ఇందుకు అవసరమైన సౌకర్యాల అభివృద్ధిపై దృష్టిసారించాలని ఆయన అధికారులను కోరారు. ముఖ్యంగా బోయింగ్ విమానాలు ల్యాండ్ అయ్యేలా రన్‌వేలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆరు విమానాశ్రయాలను విస్తరించి మరింతగా మెరుగుపరచాలని కోరారు. 
 
విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం, నెల్లూరు జిల్లాలోని దగదర్తి విమానాశ్రయాలను వీలైనంత త్వరగా నిర్మించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అలాగే, రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, మూడు ఓడరేవులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాటి అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments