Webdunia - Bharat's app for daily news and videos

Install App

19న విద్యా దీవెన నిధులు జమ : సీఎం జగన్ వెల్లడి

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (14:12 IST)
ఈ నెల 19వ తేదీన విద్యా దీవెన కింద అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి ఈ నిధులను జమ చేస్తారని ప్రభుత్వం తెలిపింది. 
 
నిజానికి ఈ నెల 18వ తేదీన తిరువూరులో సీఎం జగన్ పాల్గొనే బహిరంగ సభ జరగాల్సివుంది. అయితే, సభ జరిగే ప్రాంగణానికి సమీపంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉంది. ఇక్కడ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో ఈ సభను మరుసటిరోజుకు వాయిదావేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్య కలగరాదన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి సభను ప్రభుత్వ అధికారులు మరుసటి రోజుకు వాయిదావేశారు. 
 
కాగా, జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైన పేద విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తుంది. ఇంజనీరింగ్, వైద్య, డిగ్రీ, తదితర కోర్సులు చేసే విద్యార్థులకు రూ.20 వేలు ఇందిస్తుంది. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు చొప్పున అందిస్తుంది. ఈ విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులను ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments