Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపు పోరాటం నుంచి తప్పుకున్నానని ముద్రగడ చెప్పినా పట్టించుకోని సీఎం, ఎందుకని?

Webdunia
బుధవారం, 15 జులై 2020 (18:38 IST)
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముద్రగడ పద్మనాభం చేసిన హడావిడి అంతాఇంతా కాదు. కాపులను బిసీల్లో చేర్చాలంటూ తెగ హడావిడి చేసేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాపులతో సమావేశాలను జరిపి కాక రేపారు. ఇదంతా ఒక ఎత్తయితే వైసిపి అధికారంలోకి వచ్చింది.
 
ఆ తరువాత ఇక ముద్రగడ సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అవడమంటే జగన్మోహన్ రెడ్డిని విమర్సించకుండా ఉండిపోవడమే. తాను కాపు పోరాటం నుంచి తప్పుకున్నట్లు ఏకంగా లేఖనే రాసేశారు. దీంతో ఒక్కసారిగా కాపులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ముద్రగడ ఇలాంటి నిర్ణయం తీసుకోవడమేంటో ఎవరికీ అర్థం కాలేదు.
 
అయితే ఇదంతా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళడానికేనన్న వారు లేరు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అర్హులైన కాపు మహిళలకు నిధులు మంజూరు చేసి వారి అకౌంట్లలోనే వేశారు. ఇదిలావుంటే రిజర్వేషన్ల అంశంపై తాను ఇప్పుడు మాట్లాడితే పరిస్థితి తనకు అనుకూలంగా వుండదన్న నిర్ణయానికి ముద్రగడ వచ్చారట. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు జరుగుతుండటం ముద్రగడను బాగా భయపెట్టిందట. దీంతో తెలిసి తెలిసి అధికార పార్టీ నేతలతో ఎందుకు గొడవపెట్టుకోవడం, సైలెంట్‌గా ఉంటే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చేశారట.
 
అందుకే ఉన్నట్లుండి ముద్రగడ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలంటే ఏదో ఒకటి చేయాలని.. పూర్తిగా రిజర్వేషన్ల అంశం నుంచి పక్కకు తప్పుకుంటే ఉపయోగం ఉంటుందన్న నిర్ణయానికి వచ్చి అదే చేశారట. ఇప్పుడిదే చర్చకు దారితీస్తోంది. కాపు పోరాటం నుంచి తప్పుకున్నానని ప్రకటించినా సీఎం జగన్ ఆయనను పెద్దగా పట్టించుకోనట్లు కనబడుతోంది. దీంతో ఆలోచనలో పడిపోయారట ముద్రగడ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments