Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఇంటిని ముంచెత్తిన వరద నీరు..

ఠాగూర్
ఆదివారం, 1 సెప్టెంబరు 2024 (16:18 IST)
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు గుంటూరు అమరావతి రహదారి జలదిగ్భందంలో చిక్కుకుంది. దీంతో అటుగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు వాగు ఉదృతికి కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు తాడు సహాయంతో ఇద్దర్ని కాపాడారు. 
 
గలైంతయిన వ్యక్తి గుంటూరు వాసిగా గుర్తించారు. అమరావతి రాజధాని పరిధిలో ఊళ్లు మునిగాయి. కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండాలని అధికారులు హెచ్చరించారు.
 
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పీలేరు వాగుకు వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  
 
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. విజయవాడలో వరద.. విలయతాండవం చేసింది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. అటు కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతుంది.
 
దీని ప్రభావం వల్ల ఉండవల్లి వద్ద కృష్ణా నది తీరంలో నిర్మించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వరద ముంపు భయం నెలకొంది. ఏ క్షణంలోనైనా వరదనీరు ఆయన ఇంట్లోకి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కృష్ణానదికి సంభవించిన వరద సమయంలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రకాశం బ్యారేజీ గేట్లకు బోటును అడ్డం పెట్టారంటూ అప్పట్లో చంద్రబాబు ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments