Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెంటిమెంట్‌ రాజేసే ధోరణిలోనే తెలంగాణ సర్కారు : చంద్రబాబు

Webdunia
శనివారం, 23 మే 2015 (12:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అనంతరం ఏర్పడిన సమస్యలను సావధానంగా పరిష్కరించుకునే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించేలా లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఫలితంగానే విభజనకు సంబంధించిన వివిధ అంశాల్లో ఏర్పడిన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ‘ఇంకా ప్రజల మధ్య సెంటిమెంట్‌ను రాజేసే ధోరణి వారిలో కనిపిస్తోంది. ఇక్కడ ఆంధ్రా వర్సెస్‌ తెలంగాణ ఇష్యూ కాదు. పరస్పరం సహకరించుకునే విషయంలో కలిసి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు’ అని అన్నారు. ఉభయ ప్రభుత్వాలు కలిసి కూర్చుని మాట్లాడుకొంటే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని, కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆ సహకారం అందటం లేదని వాపోయారు.
 
ఏపీ సర్కారు చేపట్టే నవ నిర్మాణ దీక్ష తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదన్నారు. ‘విభజన జరిగిన తీరు ఏపీ ప్రజల మనసులను గాయపర్చింది. జరిగిన తీరును మనం వ్యతిరేకిస్తున్నాం తప్ప తెలంగాణ ప్రజల మనోభావాలను కాదు. కొత్త రాష్ట్రాన్ని మళ్లీ వైభవోపేతంగా తీర్చిదిద్దుకోవడానికి మనకు మనం సంకల్పం చెప్పుకోవడానికే నవ నిర్మాణ దీక్ష. విభజన జరిగిన తీరులో అన్యాయాలు, కష్టనష్టాలను చెబుదాం తప్ప తెలంగాణ ప్రజలను మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. వారు మన సోదరులు. మానసికంగా కలిసి ఉందాం. భౌతికంగా పరస్పరం పోటీపడి అభివృద్ధి చెందుదాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

Show comments