Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేప‌ల్లిలో సీఎం... వీడియో కాన్ఫ‌రెన్స్ లో అగ్రి గోల్డ్ బాధితులు

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (13:57 IST)
అగ్రి గోల్డ్ బాధితులకు రెండో విడత చెల్లింపుల‌ను ఏపీ ప్ర‌భుత్వం వినూత్నంగా నిర్వ‌హించింది. తాడేప‌ల్లి సీఎం క్యాంప్ కార్యాల‌యంలో బాధితుల‌కు వారి ఖాతాల్లోకి 20 వేల రూపాయ‌లు చెల్లింపులు నేరుగా చేశారు. కానీ, అదే కార్య‌క్ర‌మాన్ని ఏపీలోని అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ కార్యాల‌యాల‌లో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఎంత సొమ్ము బ‌కాయి ఉందో... ఆ మొత్తానికి చెక్కును డిస్ ప్లే చేశారు.  
 
20 వేల రూపాయలలోపు ఉన్న అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌ దారుల ఖాతాల్లో 7లక్షల మందికి రూ. 666.84 కోట్లు జమ చేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్ లో రాష్ట్ర దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ జే. నివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కొక్కిలిగడ్డ రక్షణ నిధి, మేయర్ భాగ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్,  వడ్డీ కార్పొరేషన్ ఛైర్పర్సన్ సైధు గాయత్రీ సంతోషి, భ‌ట్రాజు కార్పొరేషన్ ఛైర్పర్సన్ కూరపాటి గీతాంజలి త‌దితరులు పాల్గొన్నారు.

ఇప్పటికే రూ 10 వేల లోపు డిపాజిట్ దారులకు రూ 238.73 కోట్లు ఏపీ ప్ర‌భుత్వం చెల్లించింది. ఇక మూడో విడ‌త‌కు కూడా సన్నాహాలు చేస్తున్న‌ట్లు మంత్రి వెల్లంప‌ల్లి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments