Webdunia - Bharat's app for daily news and videos

Install App

27న విజయవాడలో చేపల మార్కెట్ మూసివేత

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (21:18 IST)
విజయవాడ నగరంలో రోజుకు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే క్రమములో చేపల మార్కెట్ ల వద్ద అధిక రద్దీ ఉంటున్న దృష్ట్యా నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ గారి ఆదేశాలననుసరించి ది. 27-09-2020న  ఆదివారం నగరంలో అన్ని చేపల మార్కెట్లను మూసి వేయుటం జరుగుతుందని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా.రవి చంద్ ఈ ప్రకటన ద్వారా తెలియజేసారు.
 
నగరపాలక సంస్థ పరిధిలోని బెసెంట్ రోడ్ మహంతి మార్కెట్, కొత్తపేట, చిట్టినగర్, సింగ్ నగర్, పాయకాపురం, రామలింగేశ్వర నగర్, రాణిగారి తోట మొదలగు ప్రాంతాలలో గల చేపల మార్కెట్లను పూర్తిగా మూసివేయుట జరుగుతుందని తెలియజేసారు.

నగర వీదులలో చికెన్, మటన్ విక్రయాల దారులు అధికారులతో సహకరించి covid నిబంధనలు పాటిస్తూ, వినియోగదారులు  విధిగా సామజిక దూరం పాటించేలా చూడాలని మరియు మాస్క్ లు, శానిటైజర్ అందుబాటులో ఉంచి పరిశుభ్రమైన వాతావరణంలో ఉదయం గం. 6.00 నుండి 11.00 గంటల వరకు మాత్రేమే విక్రయాలు చేసుకోవాలని అన్నారు.

సమయం పాటించకుండా వ్యాపారం కొనసాగించిన వారిపై కఠిన చర్యలు తిసుకోనబడునని, అటువంటి షాపులను సిజ్ చేయుట జరుగుతుందని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా రోడ్ల పై చేపలు, రొయ్యలు మొదలగు వాటిని విక్రయించిన యెడల అట్టి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

చికెన్ షాపుల వారు వ్యాది సోకిన/ చనిపోయిన కోళ్ళు విక్రియించరాదని అట్లు విక్రయాలు సాగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా వారి యొక్క షాపు లైసెన్స్ రద్దు పరచుట జరుగునని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments