Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికాకముందే అనుమానించాడనీ...

Webdunia
బుధవారం, 15 మే 2019 (15:20 IST)
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తనకు కాబోయే భర్త పెళ్లికి ముందే అనుమానించాడనీ తీవ్ర మనోవేదనకు గురైన ఆ యువతి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పుంగనూరు పట్టణంలోని మేలుపట్ల ప్రాంతానికి చెందిన పుష్పారాణి (24) అనే యువతికి ఇటీవలే ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. 
 
అయితే, పుష్పారాణి మాత్రం నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో చేస్తోంది. ఈ క్రమంలో ఆ ఫ్యాక్టరీలో పని చేస్తున్న మరో యుకుడితో పుష్పారాణి సన్నిహితంగా ఉంటుందనే విషయం తనకు కాబోయే భర్త గుణశేకర్‌కు చేరింది. 
 
దీంతో గుణశేఖర్, అతని సోదరుడు రేవంత్‌ కలిసి నాయుడుపేటకు వెళ్లి సదరు యువకుడిపై దాడి చేశారు. పుష్పారాణిని అవమానపరిచారు. తనకు జరిగిన అవమానాన్ని సోమవారం రాత్రి పుష్పారాణి తల్లికి వివరించింది. 
 
తల్లి పట్టణానికి వెళ్లి వచ్చేలోపు ఇంటిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇరుగుపొరుగువారు ఆమెను కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments